Serial bride case: 12 మందితో పెళ్లి..కానీ, నిత్యపెళ్లి కూతురును కాదంటున్న యువతి

విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్‌ చేసుకుని మెసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లి కూతురు నీలిమపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. అయితే తాను ఎవరిని మోసం చేశానో నిరూపించాలని నీలిమా డిమాండ్ చేస్తోంది.

New Update
Kakinada Women Cheating

Kakinada Women Cheating

Serial bride case: విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్‌ చేసుకుని మెసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లి కూతురుపై ఏపీలోని కోనసీమలో కేసు నమోదైన విషయం తెలిసిందే. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ అనే నిత్య పెళ్లి కూతురు ఇప్పటికే 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. అయితే ఈ కేసు విషయంలో ట్విస్ట్‌ నెలకొంది. తాను నిత్య పెళ్లి కూతురును అని ఆరోపణలు చేస్తున్నవారు దాన్ని నిరూపించాలని, తప్పుడు ఆరోపణలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీలిమ సీరియస్ అయింది. తాను మోసం చేశానంటున్న 12 మందిని తీసుకువచ్చి నిజనిజాలు తేల్చాలని డిమాండ్‌ చేస్తూ ఆమె పోలీసులకు రివర్స్‌ ఫిర్యాదు చేయడం గమనార్హం. తనకు జరిగిన అన్యాయం విషయంలో న్యాయంకోసం ఎంతోమందిని కలిశానని తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read :  RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
  
నిత్యపెళ్లి కూతురు కథనం ఏంటంటే...

కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ  ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. బాధితులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. వివిధ కారణాలతో విడాకులు తీసుకుని ఆర్థికంగా మంచి పోజిషన్‌లో ఉన్న మగవారిని ఆమె టార్గెట్‌ చేస్తుంది. పెళ్లిపేరుతో వారిని మోసం చేస్తుంది. దీనికి ఆమె తల్లి వీరలక్ష్మి తో పాటు రామకృష్ణ, కల్యాణ్‌లు కూడా సహకరిస్తున్నారు. ఈ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుంటారు. ఆర్థికంగా బాగున్నారంటే ఇక వారిని అసలు వదలరు. వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటుంది. కొంత కాలం తరువాత.. వారి నుంచి అందినంత సొమ్ము దోసుకుంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నిత్య పెళ్లి కూతురు నీలిమపై కొంతమంది బాధితులు సోమవారం గ్రీవెన్స్‌లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.   నీలిమ కు సహకరిస్తున్న ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, మద్దాల శ్రీను, కళ్యాణ్, దుర్గ అనే వ్యక్తులపై ఇప్పటికే పాలకొల్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

అయితే వారి ఫిర్యాదుపై స్పందించిన నీలిమ తనను నిత్యపెళ్లికూతురు అనడం సరికాదని, తాను అటువంటిది దానిని కాదనీ, తాను  ఎక్కడ 12 పెళ్ళిళ్ళు చేసుకున్నానో నిరూపించాలని సవాల్ చేస్తోంది. ఇపుడు వాస్తవం ఏమిటో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.తాను 12 పెళ్ళిళ్ళు చేసుకున్నానడం తప్పు అని ఖండించింది. ఈ పెళ్ళిళ్ళను నిరూపించకపోతే దీనిపై తాను ఎంత దూరమైనా వెళతానని నీలిమ హెచ్చరించింది.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు