Pawan Kalyan: ఈనెల 20 తర్వాత అందరినీ కలుస్తా..జనసేనాని

జిల్లాల వారీగా అందరినీ త్వరలోనే కలుప్తానని చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ నెల 20తర్వాత పిఠాపురంలో పర్యటిస్తానని, ఆ తర్వాత దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను, ప్రజలను కలుస్తానని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

New Update
Pawan Kalyan : జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

Janasena Chief Pawan Kalyan: పోటీ చేసిన అన్ని చోట్లా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందని అననారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు, వీర మహిళలు, ఉద్యోగులు అందరూ తనకు అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. చాలాచోట్ల జనసైనికులు, వీర మహిళలు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. వారందరినీ త్వరలోనే కలుస్తానని మాట ఇచ్చారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉందని..అదీ కాకుండా శాసనసభ సమావేశాలు కూడా మొదలవనున్నాయి. వీటిని పూర్తి చేసుకుని తాను జిల్లాల వారీగా పర్యటిస్తానని చెప్పారు. మొదట తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని... ఈనెల 20వ తేదీ తర్వాత అక్కడి కార్యకర్తలను, ప్రజలను కలుస్తానని తెలిపారు. ఆ తర్వాత గ్రామాలు, నియోజకవర్గాల వారీగా తిరుగుతానని అన్నారు.

నన్ను నేరుగా కలవాలని కార్యకర్తలు, నాయకులు ఆశిస్తున్నారని...తాను కూడా వారందరినీ కలవాలని, మాట్లాడాలని అనుకుంటున్నానని అన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ముందుగానే తెలియజేస్తానని అన్నారు. తనకు అభినందనలు చెప్పడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read:Visa: విద్యార్ధి వీసాల ప్రక్రియ మొదలుపెట్టిన అమెరికా..గతేడాది కంటే ఎక్కువ

Advertisment
తాజా కథనాలు