ఆమె కడుపున నువ్వు ఎలా పుట్టావురా.. అడిగింది ఇవ్వలేదని తల్లినే..

రూ.5,000 కోసం ఓ యువకుడు తల్లిని గొంతు పిసికి చంపేసిన దారుణమైన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. హిమాన్షు తన తల్లి ప్రతిమా దేవిని హతమార్చి డెడ్ బాడీని ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి హర్యానా నుంచి త్రివేణి సంగమం నదిలో పడేసేందుకు తీసుకొచ్చాడు. స్థానికులు పోలీసులకు పట్టించారు.

ఆమె కడుపున నువ్వు ఎలా పుట్టావురా.. అడిగింది ఇవ్వలేదని తల్లినే..
New Update

Bihar : నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి పాలిటే యముడు అయ్యాడు ఓ కొడుకు. తను అడిగింది ఇవ్వలేదని మాతృమూర్తిపట్ల కర్కశంగా వ్యవహరించాడు. కృర మృగంలా మారి తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె శవాన్ని వందల కిలోమీటర్ల దూరంలో పడేసి, ఎవరికీ అనుమానం రాకుండా మిస్సింగ్ కేసు పెట్టేందకు ప్లాన్ చేశాడు. కానీ ఆ దుర్మార్గుడి బాగోతం ఊహించని విధంగా బయటపడటంతో చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ దారుణమైన సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

బీహార్‌(Bihar) పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ పట్టణానికి చెందిన హిమాన్షు అనే యువకుడు ఐఐటీ(IIT) కి ప్రిపేర్‌ అవుతూనే హర్యానాలోని హిసార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొంతకాలంగా తల్లి ప్రతిమా దేవి హిమాన్షు దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు ఒక రూ.5,000 కావాలని తల్లిని అడిగితే ఆమె నిరాకరించింది. ఇప్పుడు తన దగ్గర లేవని, తర్వాత చూస్తానని చెప్పిన దేవి.. అయినా అన్ని డబ్బులు ఏం చేసుకుంటావని కొడుకును గట్టిగానే మందలించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటమాట పెరిగి తీవ్ర రూపం దాల్చడంతో విచక్షణ రహితంగా తల్లిపై దాడి చేశాడు హిమాన్షు. దేవి గొంతు బలంగా నొక్కడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన నిందుతుడు తల్లి మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా పడేసేందుకు ప్లాన్ చేశాడు.

ఇది కూడా చదవండి :తెలంగాణలో ఎన్నికలు వాయిదా!?

ఈ క్రమంలోనే మృతదేహాన్ని దగ్గరగా కట్టేసి ట్రావెల్‌ బ్యాగ్‌లో ప్యాక్ చేసి ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ బ్యాగ్‌ను త్రివేణి సంగమం వద్ద నదిలో పడేయాలనకుని చాలాసేపు అక్కడే దిక్కులు చూస్తూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే హిమాన్షుపై అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరకుని హిమాన్షు వద్ద ఉన్న బ్యాగ్‌ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. తల్లి మృతదేహం చూసి స్థానికులతోపాటు తాము షాక్‌ అయినట్లు తెలిపిన పోలీసు అధికారులు హిమాన్సును అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ భయంకరమైన సంఘటన బీహార్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

#himansh #money #mother #killed #young-man #bihar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe