BREAKING: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు

ఎన్నికల వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య టీడీపీలో చేరారు.

New Update
BREAKING: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు

YCP MLA's Joined In TDP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ (CM Jagan) కు బిగ్ షాక్ తగిలింది. ఈ రోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయం చంద్రబాబు (Chandrababu) ఆధ్వర్యంలో టీడీపీలో భారీగా చేరికలు జరిగాయి. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి టీడీపీలో చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ALSO READ: యువగళం ముగింపు సభకు ప్రత్యేక రైళ్లు

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిం చాడు: అచ్చెనాయుడు

సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత అచ్చెనాయుడు (Atchannaidu). రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధల్ని అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ఎన్నో ప్రభుత్వాల్ని చూసి ఉంటాం.. కానీ స్వాతంత్ర్య భారత చరిత్రలో ఇంతటి దుర్మార్గమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఇకపై చూడబోము కూడా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర పౌరులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలు వైసీపీకి-టీడీపీకి మధ్యనో, వైసీపీకి - జనసేన మధ్యో జరుగుతున్నవి కావని అన్నారు. 5కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అందరూ గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. నాలుగేళ్ల 7 నెలల పాలనలో అన్యాయం, అరాచకం, దోపిడీలు, దుర్మార్గా లే. ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదని అన్నారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించాడు అని ఫైర్ అయ్యారు. అందుకే జగన్ ను అభిమానించేవారు కూడా రాష్ట్రానికి పట్టిన శని ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.

రేపు జనసేన-టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని పేర్కొన్నారు. రెండు పార్టీలను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో పనిచేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు
4 ఏళ్ల 7 నెలలపాటు కష్టాలు కన్నీళ్లు భరించామని అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. జైళ్లకు పంపినా.. వేధించినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆస్తులు, ప్రాణాలు కోల్పోయినా లెక్కచేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకోసం పనిచేశారని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. మరో 100 రోజులు అందరం కష్టపడితే మన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రోజురోజుకీ వైసీపీ నుంచి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు.

ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు