Mahalakshmi Scheme : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. మహలక్ష్మీ పథకం(Mahalakshmi Scheme)లో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సదుపాయం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం (డిసెంబర్ 3వ తేదీ)తో పోలిస్తే.. ఈ ఆదివారం (డిసెంబర్ 10వ తేదీ)న దాదాపు 15 శాతం ప్రయాణికులు పెరిగారని.. ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. జీరో టికెట్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చాక.. ఎంతమంది వస్తున్నారనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి మిగతా రోజుల కంటే సోమవారం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నెల 11న కార్తిక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను కూడా రద్దు చేసింది.
పూర్తిగా చదవండి..Telangana : ఉచిత బస్సు సౌకర్యం.. 15 శాతం పెరిగిన రద్దీ..
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం (డిసెంబర్ 3వ తేదీ)తో పోలిస్తే..ఈ ఆదివారం (డిసెంబర్ 10వ తేదీ)న దాదాపు 15 శాతం ప్రయాణికులు పెరిగారని.. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
Translate this News: