పట్టపగలే మహిళా టీచర్‌ కిడ్నాప్‌.. స్కూల్‌ ముందే దారుణం

పట్టపగలే మహిళా టీచర్‌ కిడ్నాప్ కు గురైన సంఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో కలకలం రేపింది. 23 ఏళ్ల అర్పితను తను పని చేస్తున్న స్కూల్ ముందే ముగ్గురు వ్యక్తులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించికుని వెళ్లిపోయారు. సీసీటీవీలో రికార్డైన వీడియో వైరల్‌ అవుతోంది.

పట్టపగలే మహిళా టీచర్‌ కిడ్నాప్‌.. స్కూల్‌ ముందే దారుణం
New Update

కర్ణాటకలో పట్టపగలే దారుణం జరిగింది. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఏమాత్రం అనుమానం రాకుండా తనముందే ఎస్ యూవీ ఆపి ఒకేసారి ఆమెకు ఊపిరాడకుండా అదిమిపట్టి వెహికిల్ లో ఎత్తి పడేశారు. అయితే ఆ క్షణం ఏం జరుగుతుందో తెలియక షాక్ అయిన ఆమె.. వెంటనే తెరుకుని కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది.

Also read :బర్రెలక్క ఓట్ల లెక్క తేల్చేసిన సర్వే.. టెన్సన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న 23 ఏళ్ల అర్పిత గురువారం సెలవు సందర్భంగా మూసి ఉన్న ఆ స్కూల్‌ బయట ఉంది. ఒక ఎస్‌యూవీ మెల్లగా ఆమె వద్దకు వచ్చింది. సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఆ వాహనంలోకి ఎక్కించారు. కేకలు వేస్తున్న ఆమెను కిడ్నాప్‌ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అర్పిత కిడ్నాప్ వెనుక బంధువైన రాము ప్రమేయం ఉన్నట్లు ఆమె తల్లి చెప్పిందన్నారు. వారిద్దరి మధ్య నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్లుగా తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ భయంకరమైన సంఘటనతో స్థానికులు, మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఇష్యూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

#karnataka #teacher #woman #kidnapped
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe