కానిస్టేబుల్ తో భార్య అక్రమ సంబంధం.. పోలీస్ స్టేషన్ ముందే భర్త దారుణం

కానిస్టేబుల్ తో భార్య అక్రమం సంబంధం పెట్టుకుందని తెలిసి భర్త దారుణానికి పాల్పడ్డాడు. చంద్రగిరి పీఎస్‌ ముందే 5 లీటర్ల పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం మణికంఠ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు

New Update
కానిస్టేబుల్ తో భార్య అక్రమ సంబంధం.. పోలీస్ స్టేషన్ ముందే భర్త దారుణం

భార్య మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని తెలిసి భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పోలీస్ స్టేషన్ ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఈ దారుణమైన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

ఈ మేరకు స్థానిక ఎస్సై హిమబిందు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మణికంఠ.. తమిళనాడులోని తిరుత్తణికి చెందిన దుర్గని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల అభయ్ అనే పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. మూడు నెలలు క్రితం భర్తతో దుర్గ విభేదించి తిరుపతి చేరుకుంది. అక్కడ సోనూ అలియాస్ బాషాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సహజీవనం చేస్తున్న వారిద్దరూ.. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే పగడాల శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో మకాం పెట్టారు.

Also read :హైదరాబాద్ లో విషాదం.. ఇండోర్ స్టేడియం గోడ కూలి కార్మికులు మృతి

అయితే కొన్నాళ్లకు ఈ విషయం తెలుసుకున్న భర్త మణికంఠ.. చంద్రగిరి పీఎస్‌కు చేరుకుని కానిస్టేబుల్ శ్రీనివాసులను నిలదీశాడు. భార్యను వదిలేసి వెళ్లిపోవాలని.. లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తానని కానిస్టేబుల్ బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన మణికంఠ పీఎస్‌ పక్కనే ఉన్న బంక్ నుంచి 5 లీటర్ల పెట్రోల్‌ తీసుకొచ్చి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలతో అలాగే స్టేషన్‌లోకి వెళ్లి ఆర్తనాదాలు చేశాడు. పోలీసులు, స్థానికులు ఆ మంటలను ఆర్పారు. 108 అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో పశు వైద్య సంచార వాహనంలో మణికంఠను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు