/rtv/media/media_files/2026/01/26/afridi-2026-01-26-12-10-01.jpg)
షాహిద్ అఫ్రిదికి భారత్ మీద పడి ఏడవడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్లో భారత్లో ఆడేందుకు భద్రతా కారణాలు సాకుగా చూపి బంగ్లాదేశ్ తప్పుకుంది. దీంతో ఐసీసీ ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ గ్యాప్లో దూరిన అఫ్రిది.. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
𝐈𝐂𝐂'𝐬 𝐜𝐫𝐞𝐝𝐢𝐛𝐢𝐥𝐢𝐭𝐲 𝐪𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐞𝐝 𝐛𝐲 𝐒𝐡𝐚𝐡𝐢𝐝 𝐀𝐟𝐫𝐢𝐝𝐢 𝐚𝐟𝐭𝐞𝐫 𝐁𝐚𝐧𝐠𝐥𝐚𝐝𝐞𝐬𝐡'𝐬 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝐨𝐮𝐬𝐭𝐞𝐫
— IndiaToday (@IndiaToday) January 25, 2026
Shahid Afridi and Jason Gillespie have criticised the ICC's decision to remove Bangladesh from the T20 World Cup 2026. The duo… pic.twitter.com/rkfPeIh4yl
అఫ్రిది ఏమన్నారంటే?
"2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్కు రానన్న భారత్ భద్రతా కారణాలను ఐసీసీ అంగీకరించింది. కానీ ఇప్పుడు భారత్కు వెళ్లము అన్న బంగ్లాదేశ్ విషయంలో మాత్రం ఐసీసీ ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది? ఐసీసీ కేవలం భారత్ మాట మాత్రమే వింటోంది, చిన్న దేశాలను తొక్కేస్తోంది" అంటూ అఫ్రిది ఫైర్ అయ్యారు. క్రికెట్లో అందరికీ ఒకే నీతి ఉండాలని, ఐసీసీ వంతెనలు కట్టాల్సింది పోయి కూల్చేస్తోందని ఆయన విమర్శించారు.
భద్రతా ముప్పు ఏమీ లేదని తేలినా
ఐసీసీ క్లారిటీ: అయితే అఫ్రిది ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ బోర్డుతో తాము మూడు వారాల పాటు చర్చలు జరిపామని, భారత్లో వారికి ఎలాంటి ప్రాణహాని లేదని అన్ని రకాలుగా నిర్ధారించుకున్నామని ఐసీసీ స్పష్టం చేసింది. భద్రతా ముప్పు ఏమీ లేదని తేలినా బంగ్లాదేశ్ ఆడేందుకు నిరాకరించింది కాబట్టే వేరే దారి లేక స్కాట్లాండ్ను ఎంపిక చేశామని బోర్డు క్లారిటీ ఇచ్చింది. విశ్లేషకులు కూడా అఫ్రిది మాటలను కొట్టిపారేస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం అఫ్రిది అనవసరంగా భారత్ను ఈ గొడవలోకి లాగుతున్నారని వారు విమర్శిస్తున్నారు.
Follow Us