Vangalapudi Anita: రోజా నోరు జాగ్రత్త..!

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ మంత్రి రోజాపై టీడీపీ మహళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిపై అనుచితంగా మాట్లాడుతున్న రోజా.. చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు.

New Update
Vangalapudi Anita: రోజా నోరు జాగ్రత్త..!

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ మంత్రి రోజాపై టీడీపీ మహళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిపై అనుచితంగా మాట్లాడుతున్న రోజా.. చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడి వల్లే రోజా రాజకీయాల్లోకి వచ్చారని అనిత గుర్తు చేశారు. రోజా సినిమా సెట్‌లో డైలాగ్‌ చెప్పినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారన్నారు. రోజా భువనేశ్వరి కాళ్లు పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయన్న అనిత.. ఇప్పుడు జగన్‌ మోచేతి నీళ్లు పట్టుకొని తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు గతంలో క్షమించకుంటే నీ గతి ఏమయ్యేదని అని వంగలపూడి అనిత రోజాను ప్రశ్నించారు. ఇకపై రోజా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. లేకుంటే తెలుగు దేశానికి చెందిన మహిళలు తమిళనాడుకు తరిమికొడతారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

రోజా ఏమన్నారంటే.?

చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్‌ మెంట్‌ స్కీమ్‌ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి రోజా మండిపడ్డారు. పలు కంపెనీల ద్వారా చంద్రబాబు సుమారు 371 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నాడని విమర్శించారు.

చంద్రబాబు ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చుంటే ఆయన కోడలు బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా గంటకొట్టి బాబుకు సంఘీభావం తెలపాలని కోరడం ఏంటన్నారు. బహుశా బ్రాహ్మణికి అసలు సైకో ఎవరో తెలియక ట్విట్‌లు పెడుతున్నట్లు ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో అసలు సైకోలు చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది బాలకృష్ణ అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీని సినిమా సెట్ అనుకుంటున్నాడని రోజా ఎద్దేవా చేశారు. అందుకే ఆయన తొడలు కొట్టడం, విజుల్స్‌ వేయడం లాంటి వికృత చేష్టలు చేశారని విమర్శించారు.

మరోవైపు నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా.. లోకేష్‌ చేపట్టిన యువగళం యాత్రకు ప్రజా స్పందన కరువైందన్నారు. లోకేష్‌ టీడీపీ నేతలతో తన యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో నారా లోకేష్‌ సైతం జైల్లో కూర్చోక తప్పదని మంత్రి రోజా మండిపడ్డారు. తండ్రి చేసిన తప్పుల్లో తనయుడి పాత్ర కూడా ఉందని రోజా అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే జైల్లో కూర్చొని చిప్పకూడు తినడం ఖాయమని టూరిజం శాఖ మంత్రి జోస్యం చెప్పారు.

ALSO READ: టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఎలా జరిగిందంటే.!

Advertisment
తాజా కథనాలు