అమెరికాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఖైదీకి మరణశిక్ష విధిస్తుండగా అతడి రక్తనాళం దొరకకపోవడంతో ఆ శిక్ష ఆగిపోయింది. అతనికి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చేందుకు వైద్యులు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ.. రక్తనాళం కనిపించలేదు. ఇక చివరికి అతడి మరణశిక్షను నిలిపివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన థామస్ యూజీన్ క్రీచ్ (73) అనే వ్యక్తి ఓ సీరియల్ కిల్లర్. మూడు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేశాడు. అన్ని కేసుల్లో కూడా అతడు అనుమానితుడిగా ఉన్నాడు.
పూర్తిగా చదవండి..Death Sentence: ఖైదీ రక్తనాళం కనిపించక.. ఆగిపోయిన మరణశిక్ష
అమెరికాలో ఓ ఖైదీకి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా.. వైద్యులకు అతడి రక్తనాళం కనిపించకపోవడంతో మరణశిక్ష నిలిచిపోయింది. దాదాపు గంటసేపు అతడి కాళ్లు, చేతులు, భూజాలతో పాటు ఇతర భాగాల్లో వెతికిన కనిపించకపోవడంతో శిక్ష ఆగిపోయింది.
Translate this News: