Ukraine: భారత్‌లో జెలెన్‌స్కీ పర్యటన..

ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ రాయబారే కన్ఫామ్ చేశారు. అయితే ఇంకా పర్యటన తేదీలు మాత్రం ఖరారు కాలేదని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జెలెన్‌స్కీ ఇక్కడకు రానున్నారు.

Modi : మోదీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుని శుభాకాంక్షలు!
New Update

Zelenskyy India Tour: కిందట నెలలో భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని భారత్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ఏడాది చివర్లో ఇండియాలో పర్యటించనున్నారు. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ జెలెన్‌స్కీ భారత్‌కు రావం గ్యారంటీ అని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకుంటూ ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఇప్పుడు ఆదేశ అధ్యక్షుడు కూడా ఇండియాకు వస్తే..మరో అడుగు ముందుకు పడినట్టు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఇద్దరు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.. అని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ అన్నారు.

1991లో సోవియట్‌ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌గా ఏర్పడిన తర్వాత ఓ భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం మొన్నే మొదటిసారి. అంటే 33 ఏళ్ళ తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ వెళ్ళారు. ఈ నేపథ్యంలో చర్చలు, దౌత్యమార్గాల్లో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు వంటి విషయాల మీద ఇరు దేశాధినేతలూ చర్చించారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు ఇండియా అన్ని విధాలా సహకారం అందిస్తుందని..కృషి చేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. యుద్ధం కంటే శాంతి వైపే తమ చూసు ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భారత్‌కు వస్తే ఈ విషయం మరోసారి చర్యలు జరిగే అవకాశంతో పాటూ... ఆదిశగా అడుగులు వేసే పరిణామాలు కూడా సంభవిస్తాయని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి.

Also Read: Gauthi: ఐఐటీ గువాహటిలో విద్యార్థి ఆత్మహత్య

#ukraine #zelenskyy #pm-modi #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe