Encounters: ఛత్తీస్ఘడ్లో పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు ప్రాణాలు వదులుతున్నారు. దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లాలో సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో స్తర్ ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సమావేశం పెట్టుకున్నారు. దీని గురించి తెలుసుకున్న భద్రతా బలగాలు…ప్లాన్ ప్రకారం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో మావోయిస్టులు, పోలీసుల ఒకరికి ఒకరు ఎదురు పడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 13 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. దాంతో పాటూ పలువురు పోలీసులు కూడా పడ్డారని చెబుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లో కూడా మావోయిస్టు గాలింపు చర్యలు చేస్తున్నారు. అక్కడ కూడా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని సమాచారం.
పూర్తిగా చదవండి..Chhattisgarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..నాలుగు రోజుల్లో రెండు ఎన్కౌంటర్లు
రెండు రోజులుగా దండకారణ్యం దద్ధరిల్లుతోంది. కాల్పుల మోతతో హోరెత్తుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
Translate this News: