TSRTC Buses on strike: చాలా డిపోల్లో టీఎస్ఆర్టీసీ బస్సులు(TSRTC Buses) కదలడం లేదు. నిజానికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే బస్సులు బంద్ అని చెప్పినా.. కొన్ని చోట్ల మాత్రం బస్సులు ఇప్పటికీ డిపోలకే పరిమితమయ్యాయి. టీఎస్ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఎటూ తేల్చకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కార్మికులు నిరసనలను ఉధృతం చేసేలాగా కనిపిస్తున్నారు. బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. పీవీ మార్గ్ రూట్లో రాజ్భవన్కి చేరుకునేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారని సమాచారం. ఈలోపే గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) బిల్లుపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..కదలని బస్సులు.. డిపోల వద్దే కొనసాగుతోన్న నిరసనలు.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో..!
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు అంగీకరం చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమిళిసైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరుకే బస్సులు బంద్ అని చెప్పినా.. ఆ తర్వాత కూడా కొన్ని డిపోల్లో బస్సులు కదలని పరిస్థితి కనిపిస్తుంది.
Translate this News: