ఆర్టీసీ బిల్లులో ఆ అంశాలేవి.. కేసీఆర్ సర్కార్ ను క్లారిటీ అడిగిన గవర్నర్ తమిళి సై!!
టీఎస్ఆర్టీసీ బిల్.. బాల్ ను గవర్నర్ తమిళి సై కేసీఆర్ సర్కార్ కోట్ లోకి వేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిన్నింటిని లేఖ రూపంలో సంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆమె పంపారు. ఈ బిల్లులోని 5 అంశాలపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ కోరారు.