బిగ్ బ్రేకింగ్.. రేపు కూడా కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్లు ఎఫెక్ట్
కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ట్వీట్ చేశారు
ఆర్టీసీ ఇష్యూపై అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తోందన్నారు.ఆర్టీసీ విలీనం బీజేపీకి ఇష్టం లేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద బీఆర్ఎస్ వేస్తోందని ఫైర్..!!
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు అంగీకరం చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమిళిసైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరుకే బస్సులు బంద్ అని చెప్పినా.. ఆ తర్వాత కూడా కొన్ని డిపోల్లో బస్సులు కదలని పరిస్థితి కనిపిస్తుంది.
టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయనిపుణులు సలహా తీసుకున్న తర్వాతే బిల్లుపై ఓ నిర్ణయం తీసుకుంటామని ముందుగా చెప్పిన తమిళిసై(tamilisai) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు. ఈ బిల్లుపై ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు అడిగారు. వాటికి ప్రభుత్వం తక్షణమే సమాధానం చెబితే బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు గవర్నర్ తీరుకు నిరసన ఇవాళ(ఆగస్టు 5) రాజ్భవన్ని ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.