Trisha : నా కోరిక ఎప్పుడు తీరుతుందో అంటున్న త్రిష!

New Update
Trisha: అలాంటివారిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది...!!

వయసు పెరుగుతున్న కొద్ది మరింత అందంగా అనిపిస్తుంది త్రిష. ఇప్పటి కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది త్రిష బ్యూటీ. ఇండస్ట్రీకి వచ్చి 2 దశాబ్దాలకు పైగా అయినప్పటికీ ఆమెకున్న క్రేజ్‌ మాత్రం ఏం తగ్గలేదు. నాలుగు పదుల వయసులోను ఆమెను ఆరాధించే అభిమానులు కూడా బాగా పెరిగారు.

పొన్నియన్ సెల్వం చిత్రంలో త్రిష నటనకు, అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 2002 లో మౌనం పేసియాదే అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌ గా ఎంటరైంది త్రిష. ఈ ఏడాది త్రిష హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏడాది ప్రారంభంలో పొన్నియన్‌ సెల్వం రెండు భాగాలు కూడా మంచి విజయాన్ని అందించాయి.

Also read: తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు!

తాజాగా ఇప్పుడు లియో చిత్రం ద్వారా మూడో హిట్‌ ని కూడా తన ఖాతాలో వేసుకుంది.లియో సినిమా విజయోత్సవం కార్యక్రమానికి త్రిష హాజరైంది. ఈ కార్యక్రమంలో త్రిష వేదిక మీద మాట్లాడారు. '' లోకేశ్‌ కనకరాజ్‌ నన్ను కలిసినప్పుడు ఏం చెప్పారో అదే తెరపై ఆవిష్కరించారు. కొన్నేళ్ల విరామం తరువాత స్కూల్ ఫ్రెండ్స్‌ ని కలిస్తే ఎలా ఉంటుందో నాకు అలాంటి అనుభూతే..విజయ్‌ తో సినిమా చేస్తుంటే అనిపించింది. నా సినీ ప్రయాణంలో విజయ్‌ తోనే ఎక్కువ సినిమాలు చేశాను.

విజయ్‌ సింప్లిసిటీ, పనిపై తనుపెట్టే ఎఫెర్ట్‌ వేరెవరిదగ్గరా చూడలేం. నా చిరకాల మిత్రుడితో మళ్లీ ఓ సినిమా చేయాలనుంది. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో’ అంటూ ఉద్వేగంగా మాట్లాడింది త్రిష. 15 ఏళ్ల తర్వాత కూడా మా కాంబినేషన సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్‌ అయింది. హీరోయిన్స్ కి పతనాలు ఎక్కువగా ఉంటాయి.

అయినప్పటికీ అన్నివేళలా సంతోషంగా ఉండాలి. అలా ఉండటం వల్లే నా స్థానాన్ని నిలబెట్టుకుని ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అన్నారు.ఆమె మాటలు తమిళ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

Advertisment
తాజా కథనాలు