Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆగి ఉన్న లారీని ఓ ఆటో ఢీకొట్టగా దాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో.. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

New Update
Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Suryapet : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ - విజయవాడ(Hyderabad - Vijayawada) 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. అంజనాపురి అనే కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని ఓ ఆటో ఢీకొట్టగా.. దాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యయాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Also read: మెదక్ కాంగ్రెస్ లో మంటలు.. మంత్రి కొండా సురేఖ ముందే తీవ్ర వ్యాఖ్యలు!

మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్న వారిలో ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట పట్టణానికి చెందిన పుట్టా సరిత (41) (ఉపాధ్యాయురాలు) ప్రమాదం జరిగిన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట మండలం లక్ష్మీతండాకు చెందిన రుణావత్‌ రుక్కమ్మ(63), మరో రెండేళ్ల చిన్నారి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Also Read: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం?

Advertisment
తాజా కథనాలు