Vande Bharat: ఎల్లుండి నుంచే హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్ ట్రైన్..ఆగే స్టేషన్లు, టైమింగ్స్‌ ఇవే..!!

తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతికి ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది.

New Update
Vande Bharat Express: పాలమూరు పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ రైలు..

తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది.

రైలు బయలుదేరే సమయాలు

ఈనెల 24 తేదీ నుంచి కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. మొదటిరోజు ఆదివారం మ.12.30 గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రతిరోజూ (బుధవారం మినహా) కాచిగూడ నుంచి ఉ.5.30 గంటలకు రైలు బయలుదేరుతోంది. మహబూబ్‌నగర్ ఉ.6.59, కర్నూల్ సిటీ ఉ.8.39, అనంతపూర్ ఉ.10.54 స్టేషన్లలో ఆగుతూ యశ్వంత్‌పూర్‌ మ.2.15 చేరుకుంటుంది. మ.3 గంటలకు యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరి, అనంతపూర్ -సా.5.40, కర్నూల్ సిటీ రా.7.50, మహబూబ్‌నగర్ రా.21.39 స్టేషన్లలో ఆగుతూ.. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ సర్వీస్ ఒక్కరోజే

ఆదివారం ఒక్కరోజు మాత్రం.. మ.12.30కి కాచిగూడ నుంచి బయల్దేరి ఫలక్‌నుమా, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, పెండేకల్లు జంక్షన్, గుత్తి, కల్లూరు, అనంతపూర్, ధర్మవరం జంక్షన్, పెనుగొండ, రంగేపల్లి, హిందూపూర్, తొండెబావి, యలహంక జంక్షన్, లొట్టేగొల్లహల్లి మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.

ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి
ఇది 12 జిల్లాల గుండా వెళ్తుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నంద్యాల్, అనంతపూర్, శ్రీ సత్యసాయి.. కర్ణాటక, చిక్‌బళ్లాపూర్ బెంగళూరు రూరల్ వరకు వెళ్తుంది. సగటు వేగం గంటకు 71.74 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అయితే గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే టైమ్‌ 11.20 గంటలు.. వందేభారత్ రైలుతో 8.30 గంటల్లో ప్రయాణించవచ్చు. ఈ మార్గంలో వచ్చే 4 ప్రధాన స్టేషన్లు కాచిగూడ, కర్నూల్, అనంతపూర్, యశ్వంత్‌పూర్ ఈ మార్గంలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు.. సమతామూర్తి, గోల్గొండ కోట, చార్మినార్, గద్వాల్ కోట, శ్రీశైలం, సత్యసాయి ప్రశాంతి నిలయం, బెంగళూరులోని పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు