/rtv/media/media_files/2025/05/30/mMZgKIqr2YBK5AvunsYD.jpg)
Konda Vishweshwar Reddy:
బీఆర్ఎస్లో కవిత ఇష్యూ ముదురుతున్న వేళ చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు బీజేపీలోకి వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత, కేటీఆర్ను మా గేట్ కూడా దాటనివ్వమన్నారు. గులాబీ బంక మా షర్ట్స్ కి అంటుకున్నందుకే గతంలో ఓడిపోయామని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్, కవిత ల మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని అటువంటి వారిని బీజేపీలోకి చేర్చుకుంటే మాకే నష్టం అని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
కాగా క్లీన్చీట్ ఉన్న నేతలను బీజేపీలోకి వస్తే మా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన రాజా సింగ్ ఫ్రస్టేషన్ లో మాట్లాడినట్టు ఉన్నారన్నారు. ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!