/rtv/media/media_files/2025/07/19/amit-shah-2025-07-19-15-02-39.jpg)
Amit Shah
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన నగరంలో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి సెప్టెంబర్ మధ్యాహ్నం 1:10కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు. మధ్యహ్న భోజనం తర్వాత 2 నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 3 నుంచి 3:30 వరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 46 ఏళ్ల ప్రయాణంపై ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర హోంమంత్రి ప్రారంభించి.. కమిటీ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగనున్నారు. 3:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎస్ఎస్బీ 28వ బెటాలియన్ హెడ్క్వార్టర్స్కి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఐటీసీ కాకతీయ నుంచి సాయంత్రం 4 గంటలకు మెజాంజాహీ మార్కెట్ వినాయక చౌక్కు చేరుకుని గణనాథులకు స్వాగతం పలకడంతో పాటు గణేష్ శోభాయాత్రను ఉద్దేశించి ప్రసంగిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి.
అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణించే మార్గాలు, కార్యక్రమాల వేదికల వద్ద కఠిన భద్రత చర్యలు చేపట్టనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంది.