/rtv/media/media_files/2025/06/22/bjp-on-kaleshwaram-2025-06-22-13-17-30.jpeg)
తెలంగాణ బీజేపీ పార్టీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చిచ్చుపెడుతుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదేనని ఎంపీ ఈటల రాజేందర్ అంటున్నారు. ప్రాజెక్ట్కు పెట్టిన డబ్బులు వృధా కాలేదని ఆయన చెప్పుకొస్తున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్తో తెలంగాణకు లాభం ఏమిలేదని ఆయన అన్నారు. కాళేశ్వరం అంశంలో భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. ఆ 2 పార్టీలు నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఊసరవెల్లిలా విధానాలు మార్చుకునే పార్టీ మాది కాదు. వారసత్వ రాజకీయాలకు భాజపా వ్యతిరేకమని కరీంనగర్ ఎంపీ తెలిపారు. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ భాజపాలో కలిపేందుకు యత్నించారు. కానీ ఆ ప్రతిపాదనలను తిరస్కరించామని బండి సంజయ్ తెలిపారు.