/rtv/media/media_files/2025/05/09/TstNhfTPJKh7zA961gW1.jpg)
EAPCET Exam Results
తెలంగాణలో ఎప్సెట్ ఫలితాల విడుదల తేది వచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మే 11న ఆదివారం ఉదయం 11 గంటలకు విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల లిస్టును విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీ కీ ని అధికారులు విడుదల చేశారు. తాజాగా ఫలితాలు విడుదల చేయనున్నారు.
Also Read: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!
ఇదిలాఉండగా రాష్ట్రంలో ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈఏపీసెట్(TG EAPCET) పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అలాగే మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Also Read: ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రశంసలు అందుకున్న సోఫియా ఖురేషీ.. సంచలన తీర్పు!
national-news | exam