వరంగల్ కాంగ్రెస్లో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నిన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో వారంతా భేటీ అయ్యారు. సమావేశానికి జిల్లాకు చెందిన ఒక ఎంపీతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ ఎంపీ కావ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సుధారాణి సైతం ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. సమావేశం అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్లు ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా హైకమాండ్ ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు.
Also Read : ఎమ్మెల్యే Vs మేయర్.. కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
మురళి ఏమన్నాడంటే..?
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ను ఆయన మోసం చేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ మారి వచ్చిన వారు దమ్ముంటే మళ్లీ రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.
Also Read : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బ్యాటింగ్!
ప్రకాశ్ రెడ్డి 75 ఏళ్ల ముసలోడు ..
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు అంటూ సంబోధించారు. మొన్ననే తన దగ్గరకు వచ్చి ముసలోడు కాళ్లు పట్టుకున్నాడంటూ చెప్పారు. ఇక మీదట పరకాల నియోజకవర్గం తన కూతురు సుస్మిత పటేల్ దేనన్నారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు సురేఖ మంత్రి పదవి ఎటు పోదని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్
latest-telugu-news | telugu-news
TG Politics: ఎక్కువ మాట్లాడొద్దు.. కొండా మురళికి సొంత జిల్లా ఎమ్మెల్యేల వార్నింగ్!
మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళిపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన మాట్లొడొద్దన్నారు. నిన్న మురళి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఈ రోజు సమావేశమయ్యారు.
వరంగల్ కాంగ్రెస్లో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నిన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో వారంతా భేటీ అయ్యారు. సమావేశానికి జిల్లాకు చెందిన ఒక ఎంపీతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ ఎంపీ కావ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సుధారాణి సైతం ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. సమావేశం అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్లు ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా హైకమాండ్ ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు.
Also Read : ఎమ్మెల్యే Vs మేయర్.. కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
మురళి ఏమన్నాడంటే..?
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ను ఆయన మోసం చేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ మారి వచ్చిన వారు దమ్ముంటే మళ్లీ రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.
Also Read : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బ్యాటింగ్!
ప్రకాశ్ రెడ్డి 75 ఏళ్ల ముసలోడు ..
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు అంటూ సంబోధించారు. మొన్ననే తన దగ్గరకు వచ్చి ముసలోడు కాళ్లు పట్టుకున్నాడంటూ చెప్పారు. ఇక మీదట పరకాల నియోజకవర్గం తన కూతురు సుస్మిత పటేల్ దేనన్నారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు సురేఖ మంత్రి పదవి ఎటు పోదని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్
latest-telugu-news | telugu-news