BIG BREAKING: రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకో తెలుసా?

విజయవాడలో రేపు జరగనున్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఈ ఇరువురి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

New Update
Telangana CM Revanth Reddy AP tour

Telangana CM Revanth Reddy AP tour

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీకి వెళ్లనున్నారు. విజయవాడలో రేపు జరగనున్న మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు రేవంత్ హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ వర్గాలు వివరాలు వెల్లడించాయి. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఏపీకి చెందిన టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేవినేని ఉమా హైదరాబాద్ లో రేవంత్ ను కలిసి తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందించారు. గతంలో ఉన్న సన్నిహిత్యం దృష్ట్యా రేవంత్ రెడ్డి ఆ వివాహ వేడుకకు హాజరుకానున్నారు. 
ఇది కూడా చదవండి: Minister Seethakka :  ఆపరేషన్ కగార్‌ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

అమరావతికి కూడా వెళ్తారా?

మే 2న అమరావతి పునఃప్రారంభం పనులకు ప్రధాని మోదీ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ఎన్డీయేలోని ఇతర పార్టీలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉంది. గతంలో అమరావతి శంకుస్థాపన వేడుకలకు అప్పటి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించగా.. ఆయన హాజరైన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఆహ్వానిస్తారా?.. ఆహ్వానిస్తే ఆయన వెళ్తారా? అన్న చర్చ ఇరు రాష్ట్రాల రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్‌కు గాయం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్షన్‌

(telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jurala Project: జూరాలకు భారీగా వరద నీరు.. గేట్ల ఎత్తివేత

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

New Update
10 gates lifted in jurala project Due to Heavy rains

10 gates lifted in jurala project Due to Heavy rains

 భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గత 18 ఏళ్లలో చూసుకుంటే మే నెలలో జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారని అక్కడున్న స్థానిక ప్రజలు చెబుతున్నారు.  

Also read: కవిత వివాదం.. బీజీపీలో బీఆర్ఎస్ విలీనం.. బీఆర్ఎస్ నేత వినోద్ సంచలనం!

మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కురుస్తున్నాయి. దీంతో జూరాల ప్రాజెక్టులో గురువారం ఉదయానికి 6,900 క్యూసక్కుల వరద.. మధ్యాహ్న నాటికి ఏకంగా 80 వేల క్యూసెక్కులకు చేరింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జలాశయంలో నీటినిల్వ 7.682 TMCలకు చేరింది. ఇక సాయంత్రం 6.00 గంటలకు వరద 66 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.           

Also Read: ఎన్నికల్లో తేల్చుకుందాం.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ కౌంటర్

ఇదిలాఉండగా.. మహారాష్ట్రలోని ఉజని డ్యాం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జలాశయంలోకి కూడా వరద పోటెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి నాటికి జూరాలకు వచ్చే వరద లక్ష క్యూసెక్కుల వరకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.   

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

 telugu-news | rtv-news | Heavy Rains

Advertisment
Advertisment