/rtv/media/media_files/2025/02/04/wJtbaRZ9ONyOEOvi6yJK.jpg)
telangana cabinet 000 Photograph: (telangana cabinet 000)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గ్రామ పాలనా అధికారులు కొలువుదీరనున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ వలే వారి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది. 10 జిల్లాల కోర్టులకు 55 పోస్టులు మంజూరుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Also read: Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదల!
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (మార్చి 6) కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 6 గంటలపాటు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశంలో గ్రామ పాలన అధికారుల నియామకం విధివిధాలు, నోటిఫికేషన్ సంబంధించిన విషయాలపై క్లారిటీ రానుంది.
Also Read: TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం