/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
TG News:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ విప్ కాంతారావు తల్లి రేగా నర్సమ్మ (85) ఈ రోజు ఉదయం మృతి చెందారు. వారి స్వగ్రామం కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సమ్మ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధాతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇతర కీలక నేతలు సైతం నర్సమ్మ మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు.
Also Read:Phone Shaped Slab: ఇది పట్టుకుంటే ఫోన్ కి దూరమైనట్లే!.. కొత్త డిజిటల్ డీటాక్స్ టూల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ విప్ కాంతారావు గారి మాతృమూర్తి రేగా నర్సమ్మ (85) మరణం పట్ల సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
— BRS Party (@BRSparty) July 9, 2025
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్.. బాధాతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి మాతృమూర్తి రేగా నర్సమ్మ గారి మరణం పట్ల మాజీ మంత్రి @BRSHarish గారు సంతాపం వ్యక్తం చేశారు. నర్సమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. రేగా కాంతారావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ…
— Office of Harish Rao (@HarishRaoOffice) July 9, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారి మాతృమూర్తి నర్సమ్మ గారి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
— KTR News (@KTR_News) July 9, 2025
ఈ దుఃఖ సమయంలో రేగా కాంతారావు గారికి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి తల్లి నర్సమ్మ గారి మరణం బాధాకరం. నర్సమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 9, 2025
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?