నేను చచ్చానా.. మంత్రి తుమ్మలకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే-VIDEO

తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండానే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఫైర్ అయ్యారు. నేను చచ్చానా? అంటూ ప్రశ్నించారు. మంత్రి తుమ్మల సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా MLA శాంతించలేదు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update

ఖమ్మం జిల్లా కాంగ్రెల్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. పూసుకుంట రోడ్డు శంకుస్థాపనపై తనకు అధికారులు సమాచారం ఇవ్వలేదని ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎదుటే ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరుకాబోననని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా నేనున్నానా? చచ్చానా? అంటూ అధికారులను ప్రశ్నించారు. తనకు కనీస సమాచారం ఎందుకివ్వడం లేదంటూ నిలదీశారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు మంత్రి తుమ్మల సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. సారీ సార్.. నేను పాల్గొనలేనంటూ సమాధానమిచ్చారు. దీంతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని వదిలేసి ఎమ్మెల్యేను తుమ్మల తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఇతర కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేకు సర్థి చెప్పి తిరుగు ప్రయాణంలో రోడ్డు శంకుస్థాపనకు మంత్రి తుమ్మల తీసుకువచ్చారు. అయితే.. ఈ సారి కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. సమాచారం ఇవ్వనపుడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం లేదంటూ ఆందోళన చేశారు. దీంతో తుమ్మల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అయిష్టంగానే పూసుకుంట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 

అధికారులకు మంత్రి వార్నింగ్..

అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి తుమ్మల అధికారులపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. అయితే.. అధికారులు కావాలనే ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదా? ఎవరి ఒత్తిడితో వారు ఇలా చేశారు? అన్న అంశంపై ఖమ్మం కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. 

(minister-thummala-nageswara-rao | khammam | congress party news | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు