/rtv/media/media_files/2025/02/21/9ZAjLNe8zbvNrfGqauef.jpg)
peddda gattu Photograph: (peddda gattu)
Suryapet: సూర్యపేట పెద్దగట్టు జాతరలో హృదయవిదారకర ఘటన కలిచివేసింది. పొట్టకూటికోసం దేహీ దేహీ అంటూ భిక్షాటన చేసిన బాల గాంధీ ఎండకు అలిసిసొలసి అక్కడే బండలపై కునుకు తీస్తున్న దృశ్యం ఎంతోమంది పేదల సానుభూతిపరులను కన్నీరు పెట్టించింది. ఈ మేరకు గత 5 రోజులుగా సూర్యాపేట దురాజ్ పల్లి శివారు పెద్దగట్టుపై శ్రీ లింగమంతుల స్వామి జాతర జరిగింది. ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు తరలిరాగా డబ్బులు, బట్టలు, ఆహారం అడుక్కునేందుకు ఎంతోమంది నిరుపేదలు వచ్చారు.
యాచించి అలసిపోయిన పసివాడు..
ఇందులో భాగంగానే బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన కొన్ని కుటుంబాలు భిక్షాటన కోసం పెద్దగట్టు జాతరకు వచ్చాయి. పగలు రాత్రి యాచించి గట్టుపైనే నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలోనే గాంధీ తాత వేషధారణలో ఉన్న ఓ బాలుడు 5 రోజులుగా తన కుటుంబ సభ్యులతో కలిసి గుట్టపై అడుక్కుంటున్నాడు. అయితే యాచించి అలసిపోయిన ఆ పసివాడు గురువారం మధ్యాహ్నం ఎండలోనే బండలపై నిద్రపోయాడు. ఈ దృశ్యం మీడియా కెమెరా కంటపడగా క్షణాల్లో వైరల్ అయింది. సాలామంది సానూభూతిపరులు అతనిపై సింపతి చూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ఆకతాయిల ఆటకట్టించిన షీ టీమ్స్.. హైదరాబాద్లో 247 మంది అరెస్ట్!
ఓ లింగ.. ఓ లింగా...
ఇదిలా ఉంటే.. ఐదు రోజులు సాగిన దురాజ్పల్లి లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర గురువారంతో ముగిసింది. ఆ ప్రాంతమంతా ఓ లింగ.. ఓ లింగా నామస్మరణతో మార్మోగింది. జాతర చివరిరోజు భక్తులు భారీగా తరలివచ్చారు. గొర్రె పిల్లను బలిచ్చి మకర తోరణాన్ని యాదవ కులపెద్దలు సూర్యాపేటలోని గొల్ల బజారుకు తరలించడంతో జాతర పరిసమాప్తమైంది. ఇక గతేడాది ఈ జాతరకు రూ.25,71,294 ఆదాయం రాగా ఈసారి రూ.31,29,686 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక 30 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Eknath Shinde: హత్య బెదిరింపులపై స్పందించిన ఏక్నాథ్ షిండే.. ఏమన్నారంటే ?