ACB Raids : శ్రీధర్ అవినీతి తిమింగళం...కోట్లల్లో ఆస్తులు

ఏసీబీ దాడులు చేసిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ నివాసం, కార్యాలయం, బంధువుల ఇండ్లల్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఆయన పేరుతో పలు జిల్లాల్లో ఉన్న ఆస్తుల విలువ రూ. వందల కోట్లల్లోనే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.

New Update
ACB Raids

ACB Raids

ACB Raids: ఏసీబీ దాడులు చేసిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ నివాసం, కార్యాలయం, బంధువుల ఇండ్లల్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఆయన పేరుతో తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో ప్లాట్‌, కరీంనగర్‌లో 3 ఓపెన్‌ ప్లాట్లు, అమీర్‌పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 3 ఇండిపెండెంట్‌ హౌస్‌లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది.వీటి విలువ రూ. వందల కోట్లల్లో ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: ఇండియాలో తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న అవగాహన

వీటికి తోడు కార్లు బంగారు నగలు, బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉన్నట్లు కూడా తేలింది. శ్రీధర్‌ తనకున్న పదవితోనే ఇవ్వన్నీ సంపాదించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.దీంతో నూనె శ్రీధర్‌ అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. మరో వైపు ఇంకా కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 

కాగా ఇటీవలె కొడుకు పెళ్లిని ధూంధాం గా చేసిన నూనె శ్రీధర్‌ ఆస్తులపై అనుమానంతోనే ఏసీబీ దాడులు చేసినట్లు తెలుస్తోంది. మార్చి 2న  ప్రముఖ ఫామ్ హౌస్‌లో శ్రీధర్ తన కుమారుడి హల్దీ, సంగీత్ ఫంక్షన్లను ఘనంగా నిర్వహించారు. ఇక మార్చి 6న థాయిలాండ్‌లో కొడుకు వివాహం జరిపించడం గమనార్హం. అది ముగిసిన తర్వాత మార్చి 9న నాగోల్‌లోని శివం కన్వెన్షన్ హాల్‌లో ఎంతో వైభవంగా రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో  ఖర్చు చేయడం చర్చనీయంశంగా మారగా ఈ విషయమై కిందిస్థాయి అధికారులే ఏసీబీకి ఉప్పందించారని తెలుస్తోంది.  

Also Read: సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..వారి ఖాతాల్లోకి రూ.15 వేలు

ఈరోజు ఉదయం నుంచి తెలంగాణలో శ్రీధర్‌కు సంబంధించి 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్ సీఏడీ డివిజన్ 8లో శ్రీధర్ పనిచేస్తున్నారు. చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులో నాలుగు చోట్ల హైదరాబాద్‌లో ఆరు చోట్ల, కరీంనగర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కార్యాలయంతో పాటు తొమ్మిది చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.
 Also Read :  హై టెన్షన్: BRK భవన్ వద్ద భారీ బందోబస్తు

Advertisment
Advertisment
తాజా కథనాలు