TG Crime : జగిత్యాల జిల్లాలో సంచలనం...రిమాండ్ ఖైదీ పరార్

గల్ఫ్‌ పంపిస్తానని అమాయకులను మోసం చేసి జైలు పాలయిన ఓ రిమాండ్‌ ఖైదీ పోలీసులకు షాకిచ్చాడు. కోర్టు ఆవరణలో కుటుంబసభ్యులతో మాట్లాడుతూ పోలీసుల కళ్లుగప్పి పరాయ్యాడు. దీంతో అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది.

New Update
Remand Prisoner Prasad Escapes

Remand Prisoner Prasad Escape

TG Crime : గల్ఫ్‌ పంపిస్తానని అమాయకులను మోసం చేసి జైలు పాలయిన ఓ రిమాండ్‌ ఖైదీ పోలీసులకు షాకిచ్చాడు. కోర్టు ఆవరణలో కుటుంబసభ్యులతో మాట్లాడుతూ పోలీసుల కళ్లుగప్పి పరాయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది.

ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్‌ జగిత్యాల సబ్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప్రసాద్‌ గతంలో పలువురిని గల్ఫ్‌ పంపిస్తానని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడంతో పాటు పలువురిని మోస చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన మీద పలు కేసులు నమోదు కాగా అరెస్ట్‌ చేసి జగిత్యాల సబ్‌ జైలులో ఉంచారు. కాగా ఇటీవలే ప్రసాద్‌ పై కొడిమ్యాల పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. జగిత్యాల జైలు నుంచి విచారణ కోసం పీటీ వారెంట్‌తో కొడిమ్యాల పోలీసులు జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జడ్జి అతనికి రిమాండ్‌ విధించారు.

ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

అనంతరం తిరిగి జైలుకు తరలించే క్రమంలో ప్రసాద్‌ తన కుటుంబసభ్యులతో కోర్టు ఆవరణలో మాట్లాడుతాననడంతో కానిస్టేబుల్‌ సాగర్‌ రిమాండ్‌ వారెంట్‌ తీసుకోవడానికి కోర్టు లోపలికి వెళ్లాడు. సాగర్‌ అటు వెళ్లగానే  ఇదే అదునుగా భావించిన ప్రసాద్.. కానిస్టేబుల్ సాగర్ కండ్లుగప్పి కోర్టు నుంచి పారిపోయాడు. కుటుంబసభ్యులు అక్కడ ఉండగానే ప్రసాద్‌ పారిపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు వారిని విచారించి ప్రసాద్‌ కోసం వెతుకుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకోవడం చర్చనీయాంశం అయింది.

ALSO READ: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా

Advertisment
Advertisment
తాజా కథనాలు