/rtv/media/media_files/2025/06/08/tJYuzUeIwzPjFnoNyXp8.jpg)
Congress SC MLAs
SC MLAs : రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మొత్తం మీదా వారి పోరాటం విజయం సాధించిందనే చెప్పాలి. మాల, బీసీ, ఓసీ సామాజిక వర్గానికే మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం సాగిన నేపథ్యంలో మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మె్ల్యేలు పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం సైతం చేశారు. ఒక దశలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర కేబినెట్లో తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!
ఆయనతో పాటు తెలంగాణ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్ తో పాటు పార్టీ అదిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ కు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు,చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు సమావేశమై అసలైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఈ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకమాండ్ పై ఒత్తిడి తేవాలని కూడా నిర్ణయించుకున్నారు.
ఇది కూడా చదవండి: నిద్రలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే!
వారనుకున్నట్లుగానే ఢిల్లీలోని పెద్దలను కలిసి తమ సామాజికి వర్గానికి పెద్ద పీట వేయాలని కోరారు. వారనుకున్నట్లే ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సామజిక సమీకరణల వారిగా మంత్రి పదవులు కేటాయించింది. ఎస్సీ సామాజి క వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తమ పోరాటానికి తగిన గుర్తింపు లభించినట్లయిందని ఎస్సీ శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!