Revanth Reddy : కిషన్ రెడ్డివల్లే తెలంగాణకు అన్యాయం-రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తనపై చేసిన విమర్శలకు స్పందించిన కిషన్‌రెడ్డి తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని విసిరారు. కాగా ఆయనకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

New Update
kishan reddy vs revanth reddy

kishan reddy vs revanth reddy

Revanth Reddy : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.కిషన్‌రెడ్డి పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలపై స్పందించిన కిషన్‌రెడ్డి తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్‌ ఆయన విసిరారు. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ గుజరాత్ నుంచి రైళ్లల్లో నోట్ల కట్టలు పంపిస్తున్నట్లు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని,  మేం మోదీ ఆస్తులనో, కిషన్ రెడ్డి ఆస్తులనో అడగడం లేదన్నారు.రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటినే కేంద్రాన్ని అడుగుతున్నామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Also read :  నామినేటెడ్‌ పదవులు వాళ్లకే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రో ఆగిందని మరోసారి ఆరోపించారు రేవంత్‌ రెడ్డి. మూసీకి నిధులు అడిగితే అవహేళన చేస్తున్నారని, సబర్మతిని, గంగానదిని, యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేయొచ్చు కానీ మేం మూసీని ప్రక్షాళన చేయొద్దా? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వందశాతం సైంధవ పాత్ర పోషిస్తున్నాడని గాటుగా విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్ పై ఆనాడు మోడీ స్పష్టమైన ప్రకటన చేసింది నిజం కాదా? అన్నారు. ఎందుకు మెట్రోను కేంద్రమంత్రివర్గ ఎజెండాలో పెట్టడంలేదు? ఎజెండాలో పెట్టొద్దని మంత్రివర్గంపై ఒత్తిడి తెస్తోంది ఎవరు? ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రాజెక్టు ఏమైనా తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని సవాల్‌ విసిరారు.

Also Read: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

మీరు బెదిరిస్తే భయపడటానికి ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.మేం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులే అడుగుతున్నామన్నారు. కిషన్ రెడ్డి ఒక్కరోజైనా మోడీ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి కావలసినవి ఏమైనా అడిగారా? ఏ పార్లమెంట్ సమావేశంలో మీరు మాట్లాడారో చెప్పండి? అని ఆయన నిలదీశారు. ఖచ్చితంగా కిషన్ రెడ్డిది సైంధవ పాత్రనే అన్నారు. కేసీఆర్ దిగిపోయారనే బాధతో కిషన్ రెడ్డి మాపై పడుతున్నారుతెలంగాణకు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న పక్కరాష్ట్రంలో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.  బీజేపీ అధికారంలో ఉన్న బీహార్ , యూపీ లాంటి రాష్ట్రలలో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. అక్కడ ఎందుకు రద్దు చేయించడంలేదని ప్రశ్నించారు.

Also Read: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు!

ఏపీలో మీ ప్రభుత్వంలో ఉన్నా ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడంలేదన్నారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కులగణనపై విమర్శలు చేస్తున్నారు.తమిళనాడుకు మెట్రోకు అనుమతిస్తారు కానీ తెలంగాణకు ఎందుకివ్వరన్నారు. కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రోకు అనుమతులు ఇవ్వడంలేదు.ఎప్పటిలోగా మెట్రోకు అనుమతులు తెస్తారో కిషన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కులగణనలో పాల్గొనాలని కేసీఆర్ ను కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదు? లోపాలు ఉన్నాయని విమర్శించేవారు ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండని రేవంత్‌ సవాల్‌ విసిరారు. బీసీలకు అన్యాయం చేయాలనుకునే కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.బీజేపీ,బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాన్ని ఎండగడతామన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు.

Also Read: కూతురివా రాక్షసివా?.. తల్లిని ఇంతలా ఏడిపిస్తారా? హార్ట్ బ్రేకింగ్ వీడియో!

మేం ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందా చేయడంలేదు… రాష్ట్రానికి కావాల్సినవి అడుగుతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోంది.శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.సీట్ల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలని, దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, బీజేపీ కుట్రలను సాగనివ్వం… ధీటుగా ఎదుర్కొంటామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: ఇడ్లీ-సాంబార్‌ గోవా టూరిజాన్ని నాశనం చేసింది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు