Farmers: రైతుల వేషంలో పోలీసులు..దళారుల ఆటకట్టు

ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి కమీషన్లు దండుకుంటున్న దళారుల ఆటకట్టించారు పోలీసులు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 16 బృందాలుగా విడిపోయి తొమ్మిది మండలాల్లో రైతుల వేషాలతో రంగంలోకి దిగారు. 34 మంది దళారులను అదుపులోకి తీసుకొన్నారు.

New Update
Police disguised as farmers

Police Disguised as Farmers

Farmers: జిల్లాల్లోని బ్యాంకుల్లో  దళారుల దందా నడుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లా(Adilabad District) దళారుల జోరు కొనసాగుతోంది. బ్యాంకుల వద్ద అడ్డా వేసి అమాయకులైన రైతులకు రుణాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు.  రుణాలు ఇప్పించడం కోసం రైతుల వద్ద వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు(Police) రంగంలోకి దిగారు.  అయితే నేరుగా వెళ్తే దళారులు తప్పించుకుంటారని భావించిన పోలీసులు మారువేశాలు కట్టారు. అందులోనూ రైతుల వేశాలు కట్టారు. అలా వెళ్లి పలువురు దోపిడీదారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులను మోసం చేసిన 30మంది దళారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి

రుణాలు తీసుకుని చెల్లించే పరిస్థితి లేని రైతులను దళారులు ముందుగా గుర్తిస్తున్నారు. వారి రుణాలను దళారులే తీరుస్తున్నారు. రైతుల రుణాలు ముందుగా తీర్చి ఆ తర్వత రైతుల పేరుతో మరోసారి రుణాలు తీసుకుంటున్నారు. అలా తీసుకున్న రుణాల నుంచి 30 శాతం వాటా తీసుకుంటున్నారు. ఒక రైతు లక్ష రూపాయల రుణం తీసుకుంటే దాదాపు 30 వేల రూపాయలు దళారుల చేతికే ఇవ్వాల్సి వస్తుంది. దీంతో  రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు జరగడంతో మోస పోయిన  రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దళారుల ఆటకట్టించారు. రైతుల వేషంలో వెళ్లిన పోలీసులు దళారులను ఆశ్రయించి వారికి రుణాలు కావాలని మభ్యపెట్టి  ఎవరెవరూ ఉన్నారో ఎంక్వయిరీ చేశారు. 

Also Read: ఉక్రెయిన్‌ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు

ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు 16 బృందాలుగా విడిపోయారు. తొమ్మిది మండలాల్లో రైతుల వేషాలతో రంగంలోనికి దిగారు. వారిని రైతులుగానే భావించిన దళారులు బేరసారాలకు దిగారు. తర్వాత పోలీసులు గుడిహత్నూర్, ఉట్నూర్, నార్నూర్, బేల, మావల, ఇంద్రవెల్లి మండలాల్లో 34 మంది దళారులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.

Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్

జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది దళారులను అరెస్ట్ చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మరోవైపు దళారులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకు అధికారులకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో  పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ వారి పాత్ర ఉన్నట్లు తేలితే  వారిపైకూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. 
Also Read: ఉక్రెయిన్‌ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు


 

Advertisment
Advertisment
తాజా కథనాలు