పుష్ప అంతా ఫేక్.. నేనూ ఎర్రచందనం వ్యాపారినే: రాకేష్ రెడ్డి
ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల యువత పెద్ద సంఖ్యలో చెట్లు నరికేశారని.. పుష్ప 2 వల్ల ఇంకెన్నీ నరికేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐకాన్ స్టార్ అల్ల అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్కు ముందే దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న మొదటి భారతీయ సినిమాగా మరో ఘనత సాధించింది. పుష్ప-2 ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించిన సినిమా అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంపై తెలంగాణకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సినిమాలో ఎర్రచందనం ధర గురించి చూపించిందంతా అబద్ధమని తెలిపారు.
'' ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఈ చెట్లను యువత నరికేశారు. ఇప్పుడు పుష్ప-2 (Pushpa-2) కి ఇంకెన్ని చెట్లు నరికేస్తారో ?. యువత సినిమా వల్ల చెడిపోతుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ను అరెస్టు చేయాలి. సినిమాను నిలిపివేయాలని'' ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. అలాగే తాను కూడా ఎర్రచందనం వ్యాపారినేనని పేర్కొన్నారు.
రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప-2పై ఏపీకి చెందిన గన్నవరం నియోజకవర్గ జనసేన నేత చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే పుష్ప-2 సినిమాను ఏపీలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉండగా.. గురువారం పుష్ప-2 నడుస్తున్న థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. సినిమాను చూసేందుకు అల్లుఅర్జున్ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు క్యూలు కడుతున్నారు.
పుష్ప అంతా ఫేక్.. నేనూ ఎర్రచందనం వ్యాపారినే: రాకేష్ రెడ్డి
ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల యువత పెద్ద సంఖ్యలో చెట్లు నరికేశారని.. పుష్ప 2 వల్ల ఇంకెన్నీ నరికేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐకాన్ స్టార్ అల్ల అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్కు ముందే దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న మొదటి భారతీయ సినిమాగా మరో ఘనత సాధించింది. పుష్ప-2 ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించిన సినిమా అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంపై తెలంగాణకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సినిమాలో ఎర్రచందనం ధర గురించి చూపించిందంతా అబద్ధమని తెలిపారు.
Also read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్గా హైదరాబాద్ కంపెనీ..
'' ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఈ చెట్లను యువత నరికేశారు. ఇప్పుడు పుష్ప-2 (Pushpa-2) కి ఇంకెన్ని చెట్లు నరికేస్తారో ?. యువత సినిమా వల్ల చెడిపోతుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ను అరెస్టు చేయాలి. సినిమాను నిలిపివేయాలని'' ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. అలాగే తాను కూడా ఎర్రచందనం వ్యాపారినేనని పేర్కొన్నారు.
Also Read: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!
రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప-2పై ఏపీకి చెందిన గన్నవరం నియోజకవర్గ జనసేన నేత చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే పుష్ప-2 సినిమాను ఏపీలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉండగా.. గురువారం పుష్ప-2 నడుస్తున్న థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. సినిమాను చూసేందుకు అల్లుఅర్జున్ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు క్యూలు కడుతున్నారు.
Also Read: పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Also Read: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!