పుష్ప అంతా ఫేక్.. నేనూ ఎర్రచందనం వ్యాపారినే: రాకేష్ రెడ్డి

ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల యువత పెద్ద సంఖ్యలో చెట్లు నరికేశారని.. పుష్ప 2 వల్ల ఇంకెన్నీ నరికేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.

New Update
paidi rakesh

ఐకాన్ స్టార్ అల్ల అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందే దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న మొదటి భారతీయ సినిమాగా మరో ఘనత సాధించింది.  పుష్ప-2 ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన సినిమా అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంపై తెలంగాణకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సినిమాలో ఎర్రచందనం ధర గురించి చూపించిందంతా అబద్ధమని తెలిపారు.  

Also read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..

'' ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఈ చెట్లను యువత నరికేశారు. ఇప్పుడు పుష్ప-2 (Pushpa-2) కి ఇంకెన్ని చెట్లు నరికేస్తారో ?. యువత సినిమా వల్ల చెడిపోతుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌ను అరెస్టు చేయాలి. సినిమాను నిలిపివేయాలని'' ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. అలాగే తాను కూడా ఎర్రచందనం వ్యాపారినేనని పేర్కొన్నారు. 

Also Read: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!

రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప-2పై ఏపీకి చెందిన గన్నవరం నియోజకవర్గ జనసేన నేత చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్‌ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే పుష్ప-2 సినిమాను ఏపీలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉండగా.. గురువారం పుష్ప-2 నడుస్తున్న థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. సినిమాను చూసేందుకు అల్లుఅర్జున్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు క్యూలు కడుతున్నారు. 

Also Read: పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Also Read: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!

 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: రేపటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్‌.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

తెలంగాణలో సోమవారం (జూన్ 2) నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో అవినీతిని నివారించేందుకు దీన్ని తీసుకొచ్చారు.

New Update
Telangana Govt to Launch Slot Booking and AI Chatbot for Property Registrations from June 2

Telangana Govt to Launch Slot Booking and AI Chatbot for Property Registrations from June 2

తెలంగాణలో సోమవారం (జూన్ 2) నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. ప్రజలకు మరింత సులువైన సమర్ధవంతమైన సేవలు అందించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివార్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ''రాష్ట్రంలో 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఇప్పటిదాకా రెండు విడుతల్లో ప్రయోగాత్మకంగా 47 చోట్ల స్లాట్‌ బుకింగ్ విధానాన్ని అమలు చేశాం. 

Also Read: జగన్నాథుడి రథచక్రాలుగా సుఖోయ్‌ ఫైటర్‌ జెట్‌ టైర్లు (VIDEO)

జూన్ 2 నుంచి 97 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లు చేయడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాం.  రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకొస్తున్న నేప‌థ్యంలో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్యలు రాకుండా ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని అధికారులకు సూచించాం. 

ఆస్తుల క్రయ విక్రయ‌దారుల‌కు స‌మ‌యం ఆదా అయ్యేలా పార‌ద‌ర్శకంగా  మెరుగైన సేవ‌లు అందించేందుకు చేప‌ట్టిన స్లాట్ బుకింగ్ విధానం చేపట్టాం. 94 శాతం ప్రజ‌లు దీనిపై  సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు 30,592 డాక్యుమెంట్లు , రెండో దశలో 25 కార్యాలయంలో మే 12 నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు .. మొత్తం 45,191  డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్లాట్ బుకింగ్ వల్ల మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయి. 

Also Read: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!

స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ అనుసంధానంతో కూడిన చాట్‌బాట్ -మేధ 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ నూత‌న ప్రక్రియ వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారికి క‌లిగే సందేహాలు నివృత్తి అవుతాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివ‌రాలు, స‌మ‌యం అందుబాటు వంటి స‌మాచారం ల‌భిస్తుంది. గిప్ట్ డీడ్‌, సేల్ డీడ్ పై రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు  మార్కెట్ ధ‌ర‌లు త‌దిత‌ర అన్ని అంశాల‌పై  ఈ ఎఐ చాట్‌బాట్ - మేధ ద్వారా స‌మాచారం తెలుసుకోవ‌చ్చని'' మంత్రి పొంగులేటి వివరించారు. 

 telugu-news | rtv-news | sub-registrar

Advertisment
Advertisment