BIG BREAKING: తెలంగాణలో బోనాలు వాయిదా.. మంత్రి సురేఖ కీలక ప్రకటన!

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు.  వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. రాజకీయాల కోసం వివాదాలు సృష్టించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు

New Update
konda-surekhka

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు.  వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. రాజకీయాల కోసం వివాదాలు సృష్టించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అసాంఘిక శక్తులను ప్రేరేపించి..గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో వాయిదా- వేస్తున్నట్లుగా మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆగమ శాస్త్రం ప్రకారం శాకాహార బోనాలే నిర్వహించాలనుకున్నామని, కానీ మాంసాహార ప్రచారం జరిగిందని మంత్రి వెల్లడించారు.  ప్రజల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని.. భవిష్యత్ కార్యాచరణపై సంప్రదింపులు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు.  భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, పండుగను రాజకీయ రంగంలోకి లాగే ప్రయత్నాలు జరుగుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

కాగా భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే భద్రకాళి ఆలయంలో మాంసాహార బోనాలు నిర్వహించాలని కొందరు తప్పుడు ప్రచారం చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. దీంతో మంత్రి కొండా సురేఖ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయ పరిధిలో శాకాహార బోనాలే ఉంటాయని.. స్థానిక ఈవో, వేద పండితులు, ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేశాయన్నారు.  ఆగమ శాస్త్రం ప్రకారమే వేద పండితుల నిర్ణయం మేరకే భద్రకాళి ఆలయంలో బోనాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.  

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

 కడియం నల్లికుట్లోడు

మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ సంబోధించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె..  తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి కడియం నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ వ్యాఖ్యనించారు.  అందుకే తన  మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు.  సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు, మంత్రి పొంగులేటి వద్దకు వెళ్లి తన మీద ఉన్నది లేనిది చెబుతున్నాడంటూ సురేఖ కామెంట్ చేశారు. టీడీపీలో నడిచినట్లే.. కాంగ్రెస్ లో కూడా నడుస్తుందని ప్లాన్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు.  

 Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?

Advertisment
Advertisment
తాజా కథనాలు