Raghunadan Rao: కేసీఆర్ స్వరంలో భయం.. హరీష్ ఓ కరివేపాకు.. బీఆర్ఎస్ మీటింగ్ పై రఘునందన్ సెటైర్లు!

నిన్నటి మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా చెప్పిందేమీ లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆయన స్వరంలో భయం కనిపించిందన్నారు. తొలిసారి కేసీఆర్ పేపర్ చూసి ప్రసంగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హరీష్ రావు BRS పార్టీలో కరివేపాకు లాంటోడని సెటైర్లు వేశారు.

New Update

కేసీఆర్ స్వరంలో భయం కనిపించిందని రఘునందన్ రావు అన్నారు. నిన్న నిర్వహించిన రజతోత్సవ సభలో యువత కనిపించలేదన్నారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని ఆరోపించారు. 350 కోట్లు ఖర్చు పెట్టి నిన్న బీఆర్ఎస్ సభ నిర్వహించిందన్నారు. ఈ మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా మాట్లాడింది లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చుట్టాలంతా కోటీశ్వరులయ్యారన్నారు. సిద్దిపేట ప్రాంతానికి రైలు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్ కే దక్కిందన్నారు. నిన్నటి మీటింగ్ ద్వారా తన వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ స్పష్టం చేశాడన్నారు. హరీష్‌ రావు బీఆర్ఎస్ లో కూరలో కరివేపాకు లాంటి వాడని ఎద్దేవా చేశారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

 

(bjp mp raghunandan rao | kcr | harish-rao | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు