అఘోరీ దాదాపు 43 రోజులుగా చంచల్గూడ జైలులోనే ఉంది. ఇటీవలే మోకిలా, కొమురవెళ్లి కేసుల్లో అఘోరీకి బెయిల్ వచ్చింది. కానీ తన మొదటి భార్య రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. దీంతో జైల్లోనే ఉంచారు. తాజాగా చంచల్గూడ జైల్లో ఉన్న అఘోరీ అలియాస్ శ్రీనివాస్ను RTV బృందం కలిసింది. అక్కడ అఘోరీ బోరున ఏడ్చేసింది. ఈ మేరకు ఆవేదన చెందింది.
రోజుకు రెండు సార్లు రక్తాభిషేకం
RTV బృందంతో మాట్లాడిన అఘోరీ సనాతన ధర్మంపై ఆసక్తికర విషయాలు తెలిపింది. జైలులోనూ సనాతన ధర్మాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా జైల్లో రోజువారీ తన దిన చర్య ఏంటో తెలిపింది. ఉదయం లేవగానే స్నానం చేసి.. కాళీమాత, శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తానని వివరించింది. ఇలా రోజుకు రెండు సార్లు పూజలు చేస్తానని, శివయ్యకు రక్తంతో అభిషేకం కూడా చేస్తానని తెలిపింది.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
అయితే జైలులో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులోనే ఆయన్ను స్మరించుకుంటూ పూజ చేస్తున్నానని పేర్కొంది. ఎన్ని కష్టాలు వచ్చినా సనాతన ధర్మం కోసం పని చేస్తానంటూ అఘోరీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చుట్టూ ఉండే ఖైదీలు అఘోరీని అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు తెలుస్తోంది. అఘోరీని ప్రత్యేక మహిళ కారాగారంలో ఉంచి మూడు పూటల భోజనం పెడుతున్నట్లు సమాచారం.
Also Read: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా
శ్రీ వర్షిణి కనిపిస్తే
అక్కడ అఘోరీ శ్రీ వర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాకుండా శ్రీవర్షిణి బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీ వర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదు అని అఘోరీ కన్నీళ్లు పెట్టుకుంది. తన అమ్మానాన్నలకు తాను ఏం చేయలేకపోయాను అని ఆవేదన చెందింది. శివయ్య, కాళీమాతను నమ్ముకున్నానని.. అంతా ఆ పైవాడికే వదిలేస్తున్నానని తెలిపింది. ఒకవేళ తనకు బెయిల్ ఇప్పించాలంటే తన తల్లిదండ్రుల జీవనాధారమైన ఆవులను అమ్ముకోవాలి అని పేర్కొంది. అందుకే తాను వాళ్లను ఇబ్బంది పెట్టడం లేదని తెలిపింది. సనాతన ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధం అని చెప్పింది.