బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మేఘా కృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేఘా కృష్ణారెడ్డితో క్విడ్ ప్రో కో (ఒకరికొకరు వాటాలు పంచుకోవడం) చేసుకుంటుందని విమర్శలు చేశారు. '' పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి ఇద్దరూ కలిసి రూ.4,600 కోట్ల ప్రాజెక్టయిన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ను కేకు కోసుకున్నట్లు ఇద్దరు పంచుకున్నారు. 2022-23లో మేఘా ఇంజినీంగ్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వందల కోట్లు ఇచ్చింది. Also Read: కేసు విషయం నేను చూసుకుంటా.. నో టెన్షన్ : కేటీఆర్ మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి డబ్బులిస్తే.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆయనకు కొడంగల్ లిఫ్డ్ ఇరిగేషన్ ఇచ్చారు. ఇది క్విడ్ ప్రో కో నా ?. మల్లన్నసాగర్ నుంచి రూ.4 వేల కోట్ల ప్రాజెక్టు మేఘా ఇంజినీరింగ్కే రాబోతుందనే సమాచారం నాకు తెలిసింది. మూసీ ప్రాజెక్టును కూడా మేఘాతో మాట్లాడుకున్నారు. Also Read: అమెరికాలో తెలుగోళ్ల భారీ కుంభకోణం.. యాపిల్లో 185 ఉద్యోగులు ఊస్ట్ సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిపోయాక మేఘా ఇంజినీరింగ్ బ్యాన్ చేయాలని HMWS ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని రిపోర్టు ఇచ్చింది. మరీ రేవంత్ ఎందుకు చేస్తలేడు. క్విడ్ ప్రో కో నా ?. ఆయన ఇచ్చిన బాండ్లకు ప్రతిఫలంగా ప్రాజెక్టులు ఇస్తున్నావా?. ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి, కాంట్రాక్టర్ మంత్రి ఉన్నారని'' అని కేటీఆర్ అన్నారు. క్విడ్ ప్రో కో అంటే ఇదిఓ బ్రోకర్ ముఖ్యమంత్రి, కాంట్రాక్టర్ మంత్రి.కాంగ్రెస్ పార్టీకి రూ. 110 కోట్లు మేఘా కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది.. అందుకే క్విడ్ ప్రొ క్వో లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేఘాకు కట్టబెట్టిండా రేవంత్ రెడ్డి?అంతెందుకు మొన్ననే మేఘా దగ్గరనుండి… pic.twitter.com/lzBhMSxtQ8 — BRS News (@BRSParty_News) January 8, 2025