/rtv/media/media_files/2025/04/09/0Qo3F5VPuc8pEf1UtDGT.jpg)
Phone Tapping Case
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు పాస్పోర్ట్ రద్దు అయ్యింది. పాస్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి అమెరికా పారిపోయిన ప్రభాకర్రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ కావడంతో పాస్ పోర్టు అథారటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్కార్డు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే గతంలోనే పాస్ పోర్ట్ను జప్తు చేస్తున్నట్లు పాస్పోర్టు అథారిటీ ప్రకటించడంతో గ్రీన్కార్డ్ లభించలేదని తెలిసింది. మరోవైపు అమెరికా కాన్సులేట్, కేంద్రం సహకారంతో ప్రభాకర్ రావు ను ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Also Read: chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న శ్రవణ్రావును పోలీసులు ఇప్పటికే మూడు సార్లు విచారించారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను హైదరాబాద్కు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. పైగా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వస్తా అంటూ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు పాస్ట్పోర్టును రద్దు చేస్తున్నట్లు పాస్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయినప్పటి నుంచి అక్కడే తలదాచుకున్నారు. గతంలో చాలా సార్లు నోటీసులు ఇప్పించినప్పటికీ ప్రభాకర్ రావు ఇండియాకు రాలేదు.. విచారణకు సహకరించలేదు.
Also read : శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
దీంతో తెలంగాణ సీఐడీ నుంచి సీబీఐకి లేఖ రాసి.. సీఐబీ ద్వారా ఇంటర్పోల్కు సమాచారం అందించిన తర్వాత ప్రభాకర్ రావుకు రెడ్కార్నర్ నోటీసును జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ తర్వాత ప్రభాకర్రావు పాస్పోర్టును జప్తు చేస్తున్నట్లు ఇప్పటికే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో పాస్పార్ట్ను ప్రభాకర్ రావు సమర్పించాల్సి ఉంటుంది. కానీ హాండోవర్ చేయకుండా పాస్పోర్టును తన వద్దే పెట్టుకోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావు పాస్పోర్టును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అక్కడున్న అమెరికా కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్రావును హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఈ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పాస్పోర్టు రద్దు అయ్యింది. ముఖ్యంగా పాస్పోర్టును జప్తు చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నానని ప్రభాకర్రావు గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్పోర్టు రద్దు అవడంతో గ్రీన్కార్డు కూడా రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్లాలని అనుకున్నా, ఇండియాకు రావాలనుకున్న వీలులేదు. అమెరికాలో ఉన్న అధికారులు.. ప్రభాకర్రావును ఇంటర్పోల్కు అప్పగిస్తే.. ఇంటర్పోల్ సహాయంతో హైదరాబాద్కు రప్పేందుకు ఇక్కడి పోలీసులు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!