Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ Xలో షేర్ చేశారు. గతేడాది కంటే ఈ ఎగుమతులు 54 శాతం పెరిగాయని ఆయన అన్నారు.

New Update
Ashwini Vaishnaw

Ashwini VaishnawAshwini Vaishnaw Photograph: (Ashwini Vaishnaw)

భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది ఇండియా. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని Xలో షేర్ చేశారు. ప్రొడక్షన్ -లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద గవర్నమెంట్ ఇది రికార్డు బ్రేక్ చేసిన క్షణమని ఆయన ప్రశంసించారు.
ఒక సంవత్సరంలో ఎగుమతులు 54 శాతం పెరిగాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.  

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 54 శాతం పెరిగాయి. భారత్ మేక్ ఇన్ ఇండియా వైపు పరుగులు పెట్టడంతోపాటు ఉపాది అవకాశాలు సృష్టిస్తోందని ఆయన అన్నారు. భారతీయ MSMEలు ప్రస్తుతం వరల్డ్ సఫ్లై చైన్‌లో కీలకంగా మారుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఆపిల్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం షిప్‌మెంట్‌లలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉంది. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ సౌకర్యం ఒక ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. భారతదేశం నుంచి ఐఫోన్ షిప్‌మెంట్‌లలో దాదాపు సగం బాధ్యత తమిళనాడు మానిఫ్యాక్చర్ సెంటర్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు