Municipal election: కేసముద్రంలో BRS క్యాంప్ రాజకీయాలు.. ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోరు 'టై' కావడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది.

New Update
kesamudram

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోరు 'టై' కావడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కేసముద్రం మున్సిపాలిటీ భవిష్యత్ చర్చనీయాంశంగా మారింది.

బలాబలాలు ఇలా:

మొత్తం వార్డులలో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను, బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. రెండు పార్టీలు సమానంగా ఉండటంతో, ఇప్పుడు ఎక్స్‌ అఫీషియో ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. సాధారణంగా ఇద్దరు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉన్నప్పటికీ, మెజారిటీ సాధించేందుకు రెండు పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్: కేసముద్రం మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఇప్పటికే క్యాంప్‌కు తరలించింది. అంతేకాకుండా, అదనంగా మరో ముగ్గురు ఎక్స్‌ అఫీషియో ఓట్లను నమోదు చేయించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుల ఓట్లను ఇక్కడ నమోదు చేయించడం ద్వారా తమ బలాన్ని 11కు పెంచుకోవాలని ఆ పార్టీ వ్యూహం రచిస్తోంది.

ఒకవేళ ఎక్స్‌ అఫీషియో ఓట్ల తర్వాత కూడా రెండు పార్టీల బలం సమానంగా ఉంటే, అప్పుడు విజేతను తేల్చడానికి టాస్ వేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు