మొదటగా దైవసాక్షిగా ప్రమాణం.. ఆ తర్వాత KCRను ఏ ప్రశ్నలు అడిగారో తెలుసా?

హైదరాబాద్‌ BRK భవన్‌లో KCR కాళేశ్వరం విచారణ ముగిసింది. జస్టిస్ ఘోష్ కమిషన్.. కేసీఆర్‌ని 50నిమిషాలు ప్రశ్నించింది. చైర్మన్ PC ఘోష్ దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. తర్వాత కమిషన్ అడిగన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు వివరించారు.

New Update
KCR on kaleshwaram

హైదరాబాద్‌లోని BRK భవన్‌లో కేసీఆర్ కాళేశ్వరం విచారణ ముగిసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. కేసీఆర్‌ను 50నిమిషాలు ప్రశ్నించింది. విచారణ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ మొదట దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. రీ ఇంజనీరింగ్, కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ ఆమోదం‌పై ప్రశ్నలు అడిగారు. రీ ఇంజనీరింగ్ చేయడానికి ప్రధాన కారణాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో  ప్రతిదీ కేబినెట్ ఆమోదంతో జరిగిందని కేసీఆర్ తెలిపారు.

కేబినెట్ ఆమోదంతోనే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుందని బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. స్థల మార్పు నీటి లభ్యత, కాళేశ్వరం నిర్మాణంపై వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందన్నారు. కమిషన్‌కు లైఫ్‌లైన్ కాళేశ్వరం అనే పుస్తకాన్ని కేసీఆర్ అందించారు. అందులో కాళేశ్వరం ఉద్దేశ్యాలు, లాభాలు వివరంగా ఉన్నాయి. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. బ్యారేజీల్లో నీటి నిలువ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం తనకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

cbi-enquiry-on-kaleshwaram | Kaleshwaram Commission | kaleshwaram commission inquiry | kaleshwaram commission notice to kcr | kaleshwaram commission issues notice to kcr | Kaleshwaram Inquiry | telangana | latest telugu movie releases | kcr | brk-bhavan

Advertisment
Advertisment
తాజా కథనాలు