Kaleshwaram Commission : కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్..  కేసీఆర్, హరీష్‌రావుకు కమిషన్‌ క్లీన్‌చిట్?

కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. రాజకీయ నేతలను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్,హరీశ్,ఈటలె రాజేందర్ లకు క్లీన్ చీట్ ఇచ్చినట్లేనని తెలుస్తోంది.

New Update
Kaleshwaram investigation

Kaleshwaram investigation

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ సర్కార్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.  2024  మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్​జడ్జి జస్టిస్​పీసీ ఘోష్​చైర్మన్​గా ప్రభుత్వం కమిషన్ ను​ఏర్పాటు చేసింది. ముందుగా వంద రోజుల్లో  విచారణ పూర్తి చేయాలనే లక్ష్యంతో కమిషన్ ముందుకు వెళ్లింది.  దాదాపుగా వందకు పైగా అధికారులు, ఇంజనీర్లను కమిషన్ విచారణకు పిలిపించింది.  దాదాపుగా 400 పేజీలతో కూడిన నివేదికను రెడీ చేసిన కమిషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులతో పాటుగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటలను కూడా కూడా కమిషన్ విచారిస్తుందనే చర్చ జరిగింది.

లీగల్ సమస్యలు రాకూడదనే

అయితే ఇప్పుడు విచారణ దాదాపుగా ముగిసినట్లుగానే తెలుస్తోంది. మే  22 నుంచి 24 మధ్య ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చే చాన్స్ ఉంది. అయితే రాజకీయ నాయకులను ఎవర్నీ కూడా బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతో వారిని విచారణకు పిలవకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్‌ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దీంతో కేసీఆర్, హరీశ్  రావు,ఈటలె రాజేందర్ లకు  క్లీన్ చీట్ ఇచ్చినట్లేనని తెలుస్తోంది. కాగా  కాళేశ్వరం కమిషన్ గడువు  మే 31 తో ముగియనుంది.

 Kaleshwaram Commission | telangana | hyderabad | kcr | harish-rao | telugu-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు