/rtv/media/media_files/2025/07/25/drf-2025-07-25-23-23-21.jpg)
హైదరాబాద్ కు చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే హైడ్రా డిఅర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి నుంచి దుర్గం చెరువులోకి అతను దూకడానికి ప్రయత్నించాడు. కేబుల్ బ్రిడ్జి పై వరద నీరు పోవడానికి హోల్స్ క్లిన్ చేస్తున్న హైడ్రా డిఅర్ఎఫ్ సిబ్బంది రామిరెడ్డి ఆత్మహత్యం చేసుకోవడం గమనించింది. వెంటనే డిఅర్ఎఫ్ సిబ్బంది చాకచక్యంగా అతన్ని కాపాడి మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.
కేబుల్ బ్రిడ్జిపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన..హైడ్రా, డిఆర్ఎఫ్ pic.twitter.com/QlePS8RPA9
— rolex (@rolexnarsh99) July 25, 2025
మద్యానికి బానిస..ఇంట్లో గొడవలు..
రామిరెడ్డి వయసు 25 ఏళ్ళు. ఇతనికి పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది. అయితే ఇతను మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఇదే కారణంతో రామిరెడ్డి భార్య, కూతురుని తీసుకుని రామిరెడ్డిని వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మాదాపూర్ పోలీసులు ప్రస్తుతం రామిరెడ్డిని అతని సోదరికి అప్పగించారు. దాంతో పాటూ అతనికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.