/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకుల్ని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఫ్లైట్లో టెక్నికల్ సమస్యలు తరుచూ వార్తల్లో నిలుస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే అలయన్స్ ఫ్లైట్లో సాంకేతిక లోపం ఏర్పడింది. విమాన సిబ్బంది విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు. గాల్లోకి ఎగిరిని విమానాన్ని పైలట్లు తిరిగి మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ సమయంలో 67 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఘోర ప్రమాదం తప్పడంతో ప్యాసింజర్లు ఊపిరిపీల్చుకున్నారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ఘోర ప్రమాదం నుంచి విమానాన్ని కాపాడారు. ప్యాసింజర్లను సురక్షితంగా ఎయర్పోర్ట్లో దింపారు. వారంతా ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు.
శంషాబాద్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
— The Bharat (@TheBharat_News) August 19, 2025
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఒక అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తమై విమానాన్ని తిరిగి విమానాశ్రయంలో సురక్షితంగా దించారు.
విమానంలో 67 మంది… pic.twitter.com/q7oYXSq8XP
సాంకేతిక లోపం తలెత్తడం గురించి సమాచారం అందుకున్న అధికారులు విమానయాన భద్రతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. విమానయాన సంస్థ ఈ సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది. ఈ ఘటనకు గల కారణాలను విమానయాన భద్రత అధికారులు, నిపుణులు పరిశీలిస్తున్నారు. పూర్తి నివేదిక వచ్చాక విమానంలో లోపం ఎలా తలెత్తిందో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
🚨Breaking News.....
— News Voice (@News_The_Voice) August 19, 2025
శంషాబాద్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం అదేనా..?#శంషాబాద్లో#విమానం#ఎమర్జెన్సీ#ల్యాండింగ్.. #Latest_news#dailynews#international_news
source: ANDRA_JYOTHI,
https://t.co/gMNeWrKw9T
ఈ సంఘటనతో ప్రయాణికులందరూ భయపడినా, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ల సమయస్ఫూర్తితోనే ఘోర ప్రమాదం తప్పిందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన భద్రతపరంగా విమానయాన సంస్థలు ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి గుర్తు చేసింది.