/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Medchal Road Accident
Medchal Road Accident: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్(Ghatkesar) పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏదులాబాద్(Edulabad) లో అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది(Car Accident). ఈ కార్ లో భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ లు ప్రయాణిస్తున్నారు. ఇందులో భార్గవ్, వర్షిత్ లు అక్కడిక్కడే మృతి చెందారు. మరోవైపు దినేష్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ యాక్సిడెంట్ తెల్లవారుషామున జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. కారులో ఉన్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులని(Software Employees Car Accident) పోలీసులు చెబుతున్నారు.
Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
తప్పతాగి...వేగంగా కారు నడిపి..
మితిమీరిన వేగంతో కారును నడపడం వల్లనే కారు ప్రమాదానికి గురైందని స్థానికులు చెబుతున్నారు. దాంతో పాటూ నలుగురు మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు. ఏదులాబాద్ నుంచి కుంట్లూరు వైపు వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. టెకీలు నలుగురు పార్టీకి వెళ్ళి వస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: X Chat: వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్..మస్క్ మరో ప్లాన్