కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌‌లో సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్‌ కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈమేరకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

author-image
By K Mohan
New Update
kidny rakect case

kidny rakect case Photograph: (kidny rakect case)

హైదరాబాద్‌‌లో సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్‌ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీఐడీకి అప్పగిస్తూ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అలకనంద ఆసుపత్రి అక్రమ కిడ్నీ మార్పిడి జరుగుతుందని రెండు రోజుల క్రీతం పోలీసులు గుర్తించారు. అలకనంద ఆస్పత్రి ఛైర్మన్‌ సుమంత్, మరో వ్యక్తి గోపి అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు.

ఇది కూడా చదవండి: Maoist: ఈ నేలపై నక్సలిజం చావదు.. ప్రభుత్వాలవి నీటిపై రాతలే: RTVతో పౌరహక్కుల నేత!

సుమంత్, గోపితోపాటు మొత్తం 8 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ రాకెట్‌ వెనకున్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడీ శస్త్ర చికిత్సలు ఆరు నెలలుగా జరిగుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.50 లక్షలు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కిడ్నీ రాకెట్‌ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి ద్వారా కొందరి పేర్లు, ఫోన్‌ నెంబర్లు సేకరించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్

Advertisment
Advertisment
తాజా కథనాలు