/rtv/media/media_files/2025/01/14/yMwCpsLPIbs1LXAuhMj8.jpg)
Hyderabad thief jumped from the flyover
Hyderabad: తాగిన మత్తులో ఓ దొంగ ఫ్లైఓవర్పై నుంచి దూకిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. అంబర్పేట్ వంతెన రాడ్లు దొంగిలింబోతుంటే స్థానికులు కేకలు వేయగా భయంతో ఫలక్నుమాకు చెందిన రాములు(55) అమాంతం దూకేయగా గాయాలపాలయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది.
అంబర్ పేట క్క్ pic.twitter.com/DE7LCZlMCv
— mjmrr (@mjmrrrrr) January 14, 2025
ఇది కూడా చదవండి: ఆన్లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్
ఇనుప రాడ్లు దొంగతనం చేయడానికి..
ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాములు అనే వ్యక్తి మద్యం సేవించాడు. ఆ తర్వాత అంబర్పేట శ్రీ రమణ చౌరస్తా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఇనుప రాడ్లు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో రాడ్లు దొంగతనం చేస్తుండగా నిర్మాణ కూలీలు అది గమనించి కేకులు వేశారు. ఈ క్రమంలో కంగారుపడిన రాములు ఫ్లైఓవర్ పైనుంచి అమాంతం కింద దూకేశాడు. రాములుకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్పాల్..