/rtv/media/media_files/2025/06/20/hyderabad-techie-dies-by-suicide-6-months-after-wedding-after-extra-dowry-harassment-1-2025-06-20-07-05-02.jpg)
తెలంగాణలో అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM
పెళ్లైన ఆరు నెలలకే
ఈస్ట్మారేడ్పల్లిలోని అడ్డగుట్టకు చెందిన సుష్మ(27)కు, నేరేడ్మెట్కు చెందిన గొల్లూరు అమృత్కు ఈ ఏడాది జనవరి 31న మ్యారేజ్ జరిగింది. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్వేర్లే. ఈ పెళ్లికి సుష్మ ఫ్యామిలీ రూ.5లక్షలు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను కట్నంగా ఇచ్చారు.
అయితే ఇంత ఇచ్చినా.. పెళ్లైన కొద్ది రోజులకే అత్తంటివారు ఇంకా కట్నం కావాలని బాధితురాలిని వేధించారు. ఒక్క అత్తామామ మాత్రమే కాకుండా భర్త, మరిది అంతా కలిసి ఆమెను మానసిక వేదనకు గురిచేశారు. దీంతో సుష్మ అనారోగ్యానికి గురై ఈ నెల 13న హాస్పిటల్లో చేరింది. అనంతరం ఆమెను 16వ తేదీన డిశ్చార్జ్ చేసి తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు.
Also Read: ఇరాన్లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
ఆ తర్వాతి రోజు సుష్మ తన ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు తన తండ్రిని తీసుకుని అత్తగారింటికి వెళ్లింది. అక్కడ అత్తంటివారు మరోసారి సుష్మతోపాటు ఆమె తండ్రిపై సూటిపోటి మాటలు విసిరారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ దూషించారు. దీంతో సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం డ్యూటీకి వెళ్లి తిరిగి ఒంటిగంట వరకు ఇంటికి రాలేదు.
Also Read: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్
దీంతో ఆందోళన చెందిన సుష్మ తండ్రి కంపెనీ వాళ్లకు ఫోన్ చేసి అడగగా.. ఆమె 8.30 గంటలకు వెళ్లిపోయిందని తెలిపారు. వెంటనే ఆయన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు దుర్గం చెరువులో ఓ మహిళ డెడ్ బాడీ దొరికిందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆ డెడ్ బాడీ సుష్మదిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా తరలించారు. ఆపై సుష్మ ఫ్యామిలీ ఫిర్యాదుతో భర్త, అత్త, మామ, మరిదిపై కేసు నమోదు చేశారు.