/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ganja-in-Amazon-parcel-Two-students-arrested-jpg.webp)
ganja
TG Crime: హైదరాబాద్ నగరంలో గంజాయి మత్తు మరోసారి ప్రాణం తీసింది. మే 11వ తేదీ ఆదివారం రాత్రి కూకట్పల్లి ప్రాంతంలో జరిగిన దారుణ హత్య సంచలనంగా మారింది. కేసు వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్పటేల్ నగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ సమీపంలోని పార్కులో ఐదుగురు యువకులు గంజాయి తాగినట్లు స్థానికులు గుర్తించారు. అప్పటికే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్న వ్యక్తి తన స్నేహితులతో కలసి వారిని నిలదీయగా అనితో వాగ్వాదానికి దిగాడు.
Also Read : మూడు పానీయాలు తాగితే కాలేయం కుళ్లిపోవడం ఖాయం..
ఇనుప కడ్డీ గుండెల్లో తీవ్రంగా..
వివాదం కాస్తా ఘర్షణగా మారి యువకుల్లో ఒకరిగా ఉన్న పవన్ అనే వ్యక్తి తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ అనే యువకుడిపై దాడికి చేశాడు. ఇనుప కడ్డీ గుండెల్లో తీవ్రంగా గుచ్చాడు. దీంతో వెంకటరమణ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్య అనంతరం నిందితులు పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: ఎండిన కొబ్బరితో గుండెకు ప్రయోజనకరం.. బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్
గంజాయి మత్తులో నేరాల పెరుగుదలపై ఇటీవలి కాలంలో పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. సమాజంలో మత్తు పదార్థాల వినియోగం యువతను ప్రమాదకర మార్గాల్లోకి నెట్టివేస్తున్నద ని ఈ సంఘటన మరొకసారి రుజువు చేస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గంజాయి వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యువతను మత్తు పదార్థాల ప్రభావం నుండి దూరంగా ఉంచే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘోర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!
Also Read : ధోనీ వల్లే నా కెరీర్ ఎండ్.. స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు
( crime news | ts-crime | ts-crime-news)